జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నేత లక్ష్మణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇంట్లో ఈ భేటీ జరుగుతుంది. ఓవైపు బిజెపి ఇప్పటికే తమ అభ్యర్థులతో నాలుగు జాబితాలను ప్రకటించింది. కాగా జనసేన ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుండగా, ఈ భేటీ అనంతరం ఈ ఇరు పార్టీల పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ