ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోంది? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

BJP MLA Raja Singh, BJP MLA Raja Singh sensational comments, BJP MLA Raja Singh sensational comments on TRS Party, Congress call out Modi’s insult over Telengana formation, Mango News, PM insulted Telangana, PM Modi Comments on Telangana Formation Procedure, PM Modi’s words on Telangana, Protests erupt across Telangana against PM Modi, TRS, TRS angry over Modi’s remarks

ప్రధాని నిన్న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో.. తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన అధికార టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. పార్లమెంట్‌లో చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా? అని ఆయన వారిని నిలదీశారు. ఆనాడు సభలో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే చల్లుతూ గొడవ చేయడం దేశం అంతా చూసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. అయినా ప్రధాని మోదీ సభలో కాంగ్రెస్‌ని తిడితే.. కేసీఆర్‌కి, టీఆర్ఎస్ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటనతో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని స్పష్టమైందన్నారు రాజాసింగ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + thirteen =