హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఖరారు చేస్తూ బీజేపీ ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈటల రాజేందర్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ముందుగా ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నికకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హుజూరాబాద్ లో అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు పోటీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ