ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడించాలి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

BJP GHMC Campaign, BJP GHMC Elections Campaign, BJP National President, BJP National President JP Nadda, BJP National President JP Nadda Campaigns In Hyderabad, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, JP Nadda, JP Nadda Campaigns In Hyderabad, Mango News

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటుగా పలువురు నాయకులు స్వాగతం పలికారు.

అనంతరం ఆయన నగరంలో కొత్తపేట నుంచి నాగోలు వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రోడ్ షో కు హాజరైన ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ముగింపులా అనిపిస్తోందని అన్నారు. నగరంలో ప్రతి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కమలం జెండా రెపరెపలాడించాలని చెప్పారు. రోడ్ షో సమయంలో భారీ వర్షం కురియడంతో రోడ్‌షోను జేపీ నడ్డా మధ్యలోనే ముగించారు. ఆ తర్వాత తాజ్‌ బంజారా హోటల్‌లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు జేపీ నడ్డా హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =