మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. మునుగోడు సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానుండడంతో భారీ జన సమీకరణపై బీజేపీ నేతలు ఇప్పటికే దృష్టి సారించి, ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. వీరూ జనసమీకరణ మరియు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఆగస్టు 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు మునుగోడులో నా చేరిక ర్యాలీకి అమిత్ షాజీ హాజరవుతారని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ర్యాలీలో తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మునుగోడులో జరిగే బహిరంగ సభలో తనతో పాటుగా భారీ సంఖ్యలో పలు పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY