ఈ నెల 15న దారుణ హత్యకు గురైన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ సీనియర్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణయ్య హత్యలో ప్రమేయం ఉన్న ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున వీరిని ఆంధ్రప్రదేశ్లో అదుపులోకి తీసుకుని ఖమ్మంకు తలరిస్తున్నారు. ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏ-2 రంజాన్, ఏ-4 గంజి స్వామి, ఏ-5 నూకల లింగయ్య, ఏ-6 బోడపట్ల శ్రీను, ఏ-7 నాగేశ్వరరావు, ఏ-8 ఎల్లంపల్లి నాగయ్య ఉండగా ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 కృష్ణ పరారీలో ఉన్నారు.
కాగా తమ్మినేని వీరభద్రం సోదరుడైన కోటేశ్వరరావు ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు ఆరోపింపించిన సంగతి తెలిసిందే. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్య, సీపీఎం పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రానికి వరుసకి సోదరుడు అవుతారు. ఇదిలా ఉండగా తెల్దారుపల్లి గ్రామీణ మండలం మొత్తం పోలీసుల పహారాలో ఉంది. ప్రస్తుతం మండలవ్యాప్తంగా సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రికత్త వాతావరణ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY