భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి వార్డు, గ్రామం, పట్టణం, నగరాలలో బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటు చేసింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఊరూరా గులాబీ జెండా ఎగురవేస్తూ జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ప్రతినిధుల సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సభలో దాదాపు 3,000 నుంచి 3,500 మంది వరకు కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE