కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే సండ్ర భేటీ, ఖమ్మంలో జాతీయ రహదారులపై వినతి పత్రం

BRS MPs Meet Union Minister Nitin Gadkari to Discuss Issues on National Highways in Khammam,BRS MPs Meet Union Minister,Union Minister Nitin Gadkari,Nitin Gadkari to Discuss Issues,Nitin Gadkari National Highways,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలిసి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి ఎంపీలు, ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.

కేంద్రమంత్రికి అందించిన వినతి పత్రంలోని అంశాలు:

  • సత్తుపల్లి నియోజకవర్గంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా వేంసూరు, కల్లూరు మండలాల్లో ఎగ్జిట్ లేకపోవడంతో ప్రజలకు రాకపోకలు ఇబ్బంది ఉన్నాయి. ఎగ్జిట్ ఏర్పాటు ఈ విషయమై నితిన్ గడ్కరీతో చర్చించగా, సానుకూలంగా స్పందించి అధికారులను అక్కడకక్కడే ఆదేశాలు జారీ.
  • సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం పినపాక స్టేజ్ వద్ద నుండి తల్లాడ మండల కేంద్రం వరకు, వీయంబంజర్ నుండి మండాలపాడు (లంకపల్లి), కిష్టారం నుండి సత్తుపల్లి, సత్తుపల్లి నుండి బేతుపల్లి మీదుగా గంగారం వరకు ఫోర్ లైన్, కల్లూరులో ఫోర్ లైన్ ఉండగా సిక్స్ లైన్ రహదారులుగా విస్తరించాలని విజ్ఞప్తి.
  • సత్తుపల్లి శివారు తాళ్లమడ గ్రామ మధ్యలో తమ్మిలేరు వాగుపై బ్రిడ్జిపై అలైన్ మెంట్ మార్చి స్ట్రైట్ గా ఫోర్ లైన్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి.
  • సమీకృత ఖమ్మం కలెక్టరేట్ భవనం పక్క నుండి నాగపూర్ టు అమరావతి హైవే వెళుతుండగా, నగరాన్ని రెండుగా చీల్చడంతో పాటు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ను మార్చాలని విజ్ఞప్తి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =