కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం చేత ఏర్పటైన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 29, గురువారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతిభవన్ లో కలిసి నివేదిక సమర్పించింది. అంతక ముందు కొత్త సచివాలయం ఏర్పాటుకు సంబంధించి వివిధ శాఖల ఈఎన్సీ లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నూతనంగా నిర్మించబడే సచివాలయంపై అన్ని అంశాలను పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం తమ అభిప్రాయాలను సైతం జోడించిన మంత్రివర్గ ఉపసంఘం ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పించింది.
ఆర్ అండి బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నారు. వారు ముఖ్యమంత్రిని కలిసి పూర్తి స్థాయి నివేదికను సమర్పించారు. త్వరలోనే సచివాలయ పాత భవనాల కూల్చివేత పనులుకు ఆదేశాలు జారీ చేసి, నూతన భవనాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=sWrfgqXQAOo]