భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫిబ్రవరి 25న హైదరాబాద్ రానున్నారు. ప్రతిష్టాత్మక ‘నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా’ 19వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. దీనిలో భాగంగా సీజేఐ చంద్రచూడ్ స్నాతకోత్సవ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వీసీ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, లా అండ్ జస్టిస్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
ఇక ఉజ్జల్ భుయాన్ కాన్వొకేషన్కు అధ్యక్షత వహించనుండగా.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరవుతారని నల్సార్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో షామీర్పేట ప్రాంతంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి న్యాయ విశ్వవిద్యాలయం కావడం విశేషం. 1998లో దాదాపు 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా డిగ్రీ మరియు డాక్టరేట్ లా డిగ్రీని అందించే మొదటి విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి.
ఇక ఈ కార్యక్రమం అనంతరం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ రేపు ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం రానున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. రేపు సాయంత్రం శ్రీశైలానికి రానున్న సీజేఐ, 26వ తేదీన వేకువజామున ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం, కుంకుమార్చనలు వంటి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీజేఐ రాక సందర్భంగా శ్రీశైలంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సీజేఐకి స్వాగతం పలికేందుకు ఏపీకి చెందిన మంత్రులు పలువురు శ్రీశైలానికి రానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE