దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు పెద్దఎత్తున హోలీ సంబరాల్లో పాల్గొని, రంగులు చల్లుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోళీ పండుగ ఇస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఇంద్రధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ