హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల జూలై 2 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్లో ఆ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ కె లక్ష్మణ్ను కూడా ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపింది. అయితే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ రానున్న బీజేపీ అగ్ర నేతలు, ప్రధాని మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరువురూ నగరంలోనే బస చేయనున్నారని సమాచారం. ఆ రెండు, మూడు రోజులూ హైదరాబాద్లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పార్టీకి చెందిన సుమారు 300 మంది ప్రముఖులు హాజరవ్వొచ్చని, వీరందరికీ నోవాటెల్ హోటల్ వద్ద విడిది ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో నగరంలో భద్రతను భారీగా పెంచనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF