తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా పది లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. గతంలోనే 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించామని, అయితే కరోనా మహమ్మారి ప్రభావం, ఆర్థికమాంద్యం, కేంద్ర ప్రభుత్వ సహకారం కొరవడడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. తాజాగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు (రూ.2016) అందుతున్నాయని, కొత్తగా మరో పది లక్షల మందితో కలిపి మొత్తం పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరుతుందన్నారు.
ఆగస్టు 15 నుంచి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త పింఛన్ల కార్యక్రమం ఉంటుందని, పాతవారికి కూడా కొత్తగా బార్కోడ్ తో కూడిన పింఛను కార్డులు ఇస్తామని, మొత్తం 46 లక్షల మందికి కొత్త కార్డ్స్ అందుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు బాధితులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు కూడా పింఛన్లు ఇస్తున్నామన్నారు. కాగా రాష్ట్రంలోని డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు అందిస్తున్న సౌకర్యాలు కొనసాగిస్తూనే కొత్తగా ఆసరా పింఛన్ (రూ.2016) ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్పరివర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని జైళ్లశాఖను ఆదేశించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY