తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును నియమించారు. అలాగే బీసీ కమిషన్ సభ్యులుగా సీహెఛ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే.కిషోర్ గౌడ్ లను నియమించారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ సభ్యుడిగా-సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ