తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షా కాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులు, తదితరులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ వీరితో నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేయగా, జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వారిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలపై మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఈ అంశంపై జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందించారు. ఆ పంటల మ్యాప్ పై ఈ రోజు సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu