ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరున్ని, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన జ్ఞాపకాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బొజ్జల మరణం పట్ల ఆవేదన చెందిన సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ