తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్సీలు చైర్ వద్దకు తీసుకొచ్చి, బాధ్యతలు స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి.
ముందుగా శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మండలిలో చైర్మన్ పదవీ ఖాళీగా ఉండడంతో, ప్రొటెం చైర్మన్ గా మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హజన్ జాఫ్రీ వ్యవహరిస్తున్నారు. తాజాగా చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఇక మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో నల్గొండ ఎంపీగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. రైతుబంధు సమితికి తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎంపికయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ