తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ద్వారా అందుతున్నసేవలు, భూములు రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్టు తెలుస్తుంది. ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి, సమస్యల పరిష్కారానికి ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ