దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,822 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 31, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,02,66,674 కు చేరుకుంది. కరోనాతో మరో 299 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,48,738 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 98 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 26,139 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 98,60,280 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.04 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. భారతదేశం యొక్క కరోనా రికవరీ రేటు 96 శాతం దాటడంతో ప్రపంచంలోనే అత్యధికంగా నిలిచింది. ప్రస్తుతం 2,57,656 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 21,822 కేసులలో 79.87 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ