నగరంలోని కోఠిలో గల వైద్య ఆరోగ్య శాఖ మందిరంలో వైద్య పరికరాల తయారీ కంపెనీలతో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. 3 ఎంఆర్ఐ, 11 సిటీ స్కాన్ మిషన్లు, 3 కార్డియాక్ కేథ్లాబ్ లు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేసిన నేపథ్యంలో సాంకేతిక విషయాలు, మైంటేనేన్స్, ధరల విషయాలుపై ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ చర్చించారు.
ప్రభుత్వం తరపున ప్రజలకు సౌకర్యాలు పెంచాలి అనే ప్రయత్నం చేస్తున్నాము. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సకు పేద ప్రజలు సైతం 30 నుండి 40 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. వారికి భారం లేకుండా వైద్యం అందించాలనే మంచి ఉద్దేశ్యం తో పని చేస్తున్నాం కాబట్టి కంపెనీల వారు కూడా సహకరించాలని మంత్రి కోరారు. అలాగే మంచి మిషన్లు తక్కువ ధరకు అందించాలని సూచించారు. ఇక పెద్ద పెద్ద మిషన్లు కొనుగోలు చేయడం కంటే, ఎక్కువ మందికి ఉపయోగపడే మిషన్లు కొనుగోలు చేయడం మంచిదని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ