తెలంగాణ రాష్ట్రం నుండి ఐటి ఎగుమతులు ఆకట్టుకునే వృద్ధిని సాధించడంతో రాష్ట్ర ఐటీ శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సీఎం కేసీఆర్ ను కలుసుకుని 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి ఎగుమతులు, ఉపాధి కల్పన సమాచారాన్ని పంచుకున్నారు. దేశం సగటు 8.09%, దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు 6.92% తో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ఎగుమతుల వృద్ధి 17.93% వద్ద ఉందని చెప్పారు.
దేశంలో తెలంగాణ ఎగుమతుల వాటా 10.6% నుండి 11.6% కి పెరిగిందని, అలాగే ఈ ఏడాది జాతీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.5% గా ఉండడం పట్ల సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఐటీ పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా ఉంటుందని చెప్పేందుకు ఈ గణాంకాలు స్పష్టమైన సూచనగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఐటి పరిశ్రమ సజావుగా సాగేలా అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu