మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత.. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డ మంత్రి

Telangana Minister Malla Reddy Responds Over IT Raids After Son Mahender Reddy Admitted in Hospital Due to Illness,Mallareddy's son is unwell,TRS minister is angry,family has been targeted,Mango News,Mango news telugu,It Officials Raids,It Raids On Trs Minister Malla Reddy,Trs Minister Malla Reddy,Mango News,Mango News Telugu,Malla Reddy It Raids,It Raids On Malla Reddy And His Kin,Income Tax Department,Telangana It Dept Raids,Telangana It Raid On Minister Malla Reddy,Malla Reddy It Raids ,It Raids Latest News And Updates

తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి పొద్దు పోయేవరకూ దాదాపు 46 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు తిరిగి బుధవారం వేకువజామునుంచే మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై మళ్ళీ తనిఖీలు మొదలుపెట్టారు. ఆయనకు సంబంధించిన యూనివర్సిటీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కాలేజీలు సహా ఇతర వ్యాపార సంస్థలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు ఐటీ అధికారులు. అయితే ఈ సమయంలో మహేందర్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఐటీ అధికారులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో మహేందర్‌ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఆయనను ఐటీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కుమారుడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి బయట మంత్రి మల్లారెడ్డి మెడియాతో మాట్లాడుతూ.. ‘ఐటీ అధికారులు నా కొడుకును కొట్టినట్లు అనుమానంగా ఉంది, నా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నా కొడుకును కూడా చూడనివ్వడం లేదు. తనని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్లున్నారు. అందుకే తనకి ఛాతీలో నొప్పి వచ్చింది. అయినా మేము ఎవరిని మోసం చేయడం లేదు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే నాపై దాడులు చేయిస్తున్నారు. అందుకే నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =