తెలంగాణలోని అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, ఉన్నతాధికారులకు సూచించారు. ‘‘తక్షణమే వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీలను చేపట్టండి. ప్రమోషన్లు పెండింగులో వుంటే వెంటనే ఇచ్చేయండి. భార్యాభర్తలు ఇద్ధరూ ఉద్యోగులే అయితే ఒకే చోట పనిచేసేలా వారికి అవకాశాలు కల్పిస్తూ బదిలీ చేసే దిశగా ఉత్తర్వులు సిద్ధం చేయండి’’ అని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవంగా సత్కరించి ఇంటికి సాగనంపాలన్నారు. వ్యవసాయశాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందని, రైతులకు సేవచేసేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సంసిద్ధ పరుచుకోవాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ ఉద్యోగుల మీద వున్నది. వ్యవసాయశాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్టుమెంటు కాదు, చాలా డైనమిక్ డిపార్ట్మెంట్ గా మారబోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu