తెలంగాణ సీఎం, టిఎస్ఆర్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. దుబ్బాకలో పార్టీ ఓటమి పాలవడం వెనుక గల కారణాలపై సీఎం కేసీఆర్ కీలకంగా సమీక్షించారు. ఓటమి నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై మంత్రులు, నాయకులకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, పార్టీ గెలుపుకోసం తీసుకోవాల్సిన చర్యలు, సమాయత్తం కావల్సిన తీరుపై కూడా చర్చించి నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ