రేడియో న్యూస్ రీడర్ గా ప్రజలకు చిరపరిచితుడైన ఏడిద గోపాలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోపాలరావు వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ