తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఈ రోజు ఉదయం గన్పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి ఘటనలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నారు..
అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శానమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు తెలంగాణ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ