తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ రోజు గవర్నర్ పుట్టినరోజు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై వీరివురూ చర్చించినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ