తెలంగాణాలో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు – మంత్రి తలసాని

CM KCR Insists on Eradicating Drugs Mafia in Telangana Says Minister Talasani Srinivas, CM KCR Insists on Eradicating Drugs Mafia in Telangana, Minister Talasani Srinivas, Eradicating Drugs Mafia in Telangana, Drugs Mafia in Telangana, Minister Talasani Srinivas Says CM KCR Insists on Eradicating Drugs Mafia in Telangana, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, Chief minister of Telangana Insists on Eradicating Drugs Mafia in Telangana, Drugs Mafia, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టడానికి సీఎం కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయంలో సీఎం మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని మంత్రి తలసాని వెల్లడించారు. ఈరోజు (గురువారం) నార్త్ జోన్ పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణాలో డ్రగ్స్ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

అదేవిధంగా తెలంగాణ పోలీసులు కూడా డ్రగ్స్ విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందని  మంత్రి తలసాని అన్నారు. ఒక్కసారి డ్రగ్స్ కేసులో దొరికితే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం యువతలో చాలామంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని.. అలా ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చివరకు జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కార్పోరేట్ ఆఫీలకు ధీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 5 =