ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు (గురువారం) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో.. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూధన్ రెడ్డి ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాటి శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు. అలాగే, దీనితోపాటుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును కూడా సీఎం జగన్ సమీక్షించారు. ప్రధానంగా సొసైటీల బలోపేతం, కంప్యూటరైజేషన్, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా.. సహకార బ్యాంకుల పనితీరుని, వాటి బలోపేతానికి శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ