కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సిఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని సీఎం నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ