తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7, సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. కాగా ఈ బడ్జెట్ సమావేశాలు నేటితో (మార్చి 15, మంగళవారం) ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ద్రవ్య వినిమయ బిల్లు-2022ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ ప్రారంభమవగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముందుగా మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలను సజావుగా నడిపించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి అక్బరుద్దీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు.
అలాగే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని చెప్పారు. రాష్ట్రంలో 80, 039 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని, పలుసార్లు పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ