తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. దీంతో ఈ రోజు నుంచి రాష్ట్రంలో ధరణి పోర్టల్ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డి, రెవెన్యూ అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu