తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఇతర నేతలతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం-వైరా ప్రధాన రహదారిలో వీవెంకటాయపాలెం వద్ద రూ.53.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి.రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ముందుగా ఖమ్మం కలెక్టరేట్ శిలాఫలకాన్ని జాతీయ నేతలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవన సముదాయం వివరాలను సీఎం కేసీఆర్ వారికీ వివరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో కూడా సీఎం, జాతీయ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్ లోని కుర్చీలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ నేతలు కూడా కలెక్టర్ వీపీ గౌతమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు.
మరోవైపు ముందుగా యాదాద్రి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లలో ఖమ్మంకు చేరుకున్న సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఇతర జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎంలు ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్, ఇతర సీఎంలు, జాతీయ నేతలతో కలిసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE