అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. యాసల బాలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని సీఎం అన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే బాలయ్య మృతిపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. “గ్రామీణ జీవ కళను ఉట్టిపడేలా ఎన్నో చిత్రాలను వేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పల్లె సంస్కృతి గొప్పదనాన్ని చాటి చెప్పిన ప్రఖ్యాత బాతిక్ చిత్రకారుడు యాసల బాలయ్య మృతి బాధాకరం. తెలంగాణరాష్ట్రం ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది. ఎంతో మంది కళాకారులను తయారుచేసిన వారి సేవలు మరువలేనివి” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ