దేశంలో టాప్ ఆదర్శ గ్రామాల జాబితాలో తెలంగాణ గ్రామాలు మరోసారి సత్తా చాటాయి. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 11, 2014న సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంసద్ ఆదర్శ గ్రామ్ యోజనలో టాప్ 10లో ఉన్న 10 గ్రామాల్లో మొత్తం 10 గ్రామాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే టాప్ 20లో నిలిచిన గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవే ఉండడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పల్లె ప్రగతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ విజన్ కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Proud to share that all 10 out of top 10 villages in Sansad Adarsh Garmina Yojana are from #Telangana👏 19 out of top 20 villages from TS
Heartiest congratulations to Hon’ble CM KCR Garu for his vision, especially Palle Pragathi. Compliments to PR Minister @DayakarRao2019 & team pic.twitter.com/z4dhX6I4OV
— KTR (@KTRTRS) April 26, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ