ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఎస్వీ ప్రసాద్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎస్వీ ప్రసాద్ 1975 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబ్ కలెక్టర్ గా, కలెక్టర్ గా, పలు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా, అలాగే 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) విధులు నిర్వర్తించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ