తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మే 31, మంగళవారం నాడు 61,166 మందికి మొదటి డోస్, 17,141 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే మంగళవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 60,63,512 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇందులో 46,83,457 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 13,80,055 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి ఇప్పటివరకు 61,37,080 కరోనా వ్యాక్సిన్ డోసులు అందగా, 60,63,512 డోసులను వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 62,970 వ్యాక్సిన్ డోసులు ఆర్మీ దళాలకు అందజేసినట్టు తెలిపారు. అలాగే 0.17 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ