జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఎప్పటికీ స్మరణీయుడే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ వర్థంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు. తన మాట ద్వారా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ భాష, యాసలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వరాష్ట్ర ఆకాంక్షను పెంపొందించడంలో కాళోజీ కీలక పాత్ర పోషించారు. హక్కులపై ప్రశ్నిస్తూ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలంతోనే కాళోజీ పోరాడేవారు. 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ను కూడా కాళోజీ అందుకున్నారు. మరోవైపు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ