భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 44879 పాజిటివ్ కేసులు, 547 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 87,28,795 కు, మరణాల సంఖ్య 1,28,668 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో రోజురోజుకి యాక్టీవ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 4,84,547 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 49,079 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 81,15,580 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 92.97 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.47 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 13, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 87,28,795
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 12–నవంబర్ 13 (8AM-8AM)] : 44879
- నమోదైన మరణాలు : 547
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 81,15,580
- యాక్టీవ్ కేసులు : 4,84,547
- మొత్తం మరణాల సంఖ్య : 1,28,668
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ