తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ వినతి మేరకు సీఎం కేసీఆర్ “కోటి వృక్షార్చన”లో స్వయంగా పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ ను సీఎం కేసీఆర్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ