జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలంగాణ భాష, సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా డా.సినారె నిలిపారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యునిగా, వివిధ యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్ గా, ఆయన చేసిన సేవలు విలువైనవన్నారు. కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన డా.సినారె, తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని సీఎం తెలిపారు. డా.సినారె సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్ లో “సినారె సారస్వత సదనం” నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ