తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ను శనివారం నాడు తెలుగు సినిమా అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రభుత్వ చర్యలకు సాయంగా చిరంజీవి రూ.కోటి, నాగార్జున రూ.50 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ ను వారిద్దరూ స్వయంగా కలుసుకుని చెక్కులు అందజేశారు. అలాగే ఈ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో థియేటర్స్ ప్రారంభించడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ