సినీనటుడు కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో మంగళవారం కృష్ణ పార్ధివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కృష్ణ తనయుడు, సినీనటుడు మహేశ్ బాబుతో పాటు, వారి కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు చలన చిత్రరంగంలో సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప మిత్రుడిని కోల్పోయానని, ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చానని సీఎం చెప్పారు. విజయనిర్మల గారు పరమపదించిన సందర్భంలో కూడా తాను వచ్చానన్నారు. కృష్ణ ముక్కుసూటిగా, అరమరికలు లేకుండా మాట్లాడే మనిషి అనీ, విలక్షణమైన నటుడిగా. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవ కూడా చేశారని సీఎం కొనియాడారు.
తాను ఓసారి అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుంది అని కృష్ణ గారితో అన్నప్పుడు ఆయన నవ్వుతూ, కేసీఆర్ గారూ మీరు సినిమాలు కూడా చూస్తారా? అన్నారని…అల్లూరి సీతారామరాజు సినిమాను తాను చాలాసార్లు చూశానని, కృష్ణ గారికి చెప్పానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తిని ఉద్భోదించే, స్వతంత్ర పోరాటాన్ని తెలియజెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించిన సీనియర్ నటుడుగా, దేశభక్తిని పెంపొందింపజేసే వారి ప్రయత్నాన్ని గుర్తిస్తూ, తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, కృష్ణ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. కృష్ణ కుటుంబానికి కూడా ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE