బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగించుకొని డిసెంబర్ 16, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించే నేపథ్యంలో డిసెంబర్ 12, సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ డిసెంబర్ 14, బుధవారం నాడు ప్రారంభించారు. బుధవారం నుంచి సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు నాయకులతో పార్టీ, రాష్ట్ర సంబంధిత అంశాలపై చర్చించారు.
ఇక శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్లోని పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. కార్యాలయంలోని తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, ప్రముఖులతో కాసేపు చర్చించారు. అనంతరం కార్యాలయ మొదటి రెండో అంతస్థులో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. ఆనంతరం తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, అభివాదం చేస్తూ పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎంపీలు, పార్టీ నాయకులు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE