టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేడు (మార్చి 21, సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కీలకంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై రూపకల్పన చేయనున్నారు. కేంద్రం పంజాబ్ లో వరి ధాన్యాన్ని 100 శాతం సేకరిస్తున్నందున నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 100 శాతం వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇక వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్న క్రమంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రుల బృందం నేడే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ