తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 7, బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాలకు చేరుకొని, ముందుగా నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నీ ప్రారంభించనున్నారు. అనంతరం జగిత్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు జగిత్యాల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించి, అక్కడే జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3:10 గంటలకు మోతె శివారులో జరగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం జగిత్యాల పర్యటన నేపథ్యంలో నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను, అలాగే బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సహా పలువురు నాయకులు మంగళవారం పరిశీలించి, కీలక సూచనలు చేశారు. ఈరోజు జగిత్యాలలో జరిగే సీఎం పర్యటనలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE