తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాసేపట్లో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గాంధీ ఆసుపత్రిని పుర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించనున్నారు. మరోవైపు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కూడా ప్రస్తుతం సీఎం కేసీఆర్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ