తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మరో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని మరో ప్రముఖ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రెండో అతిపెద్ద పవిత్రక్షేత్రంగా మార్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొండగట్టు అంజన్న దేవస్థానం అభివృద్ధికి 100కోట్ల రూపాయల నిధులు కేటాయించడం తెలిసిన విషయమే. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ ఈనెల 15వ తేదిన కొండగట్టులో పర్యటించనున్నారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలోని కాన్ఫరెన్స్ హాల్లో కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయం తదితర ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తర్వాత అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్పీ భాస్కర్ తదితరులు పరిశీలించారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేసీఆర్ మంగళవారం వెళ్లాలని భావించినప్పటికీ కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE