తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. నల్గొండ పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్, పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ కు తిరుగు పయనమవనున్నారు. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ