అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 16 తేదీ వరకు వరంగల్ నగరంలో జరిగే భద్రకాళి దేవీ శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, భద్రకాళి ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ